చైతన్య – శోభిత ఎంగేజ్‌మెంట్ డ్రెస్సులు డిజైన్ చేసింది ఎవరో తెలుసా.. అస్సలు ఊహించి ఉండరు!

by Kavitha |
చైతన్య – శోభిత ఎంగేజ్‌మెంట్  డ్రెస్సులు డిజైన్ చేసింది ఎవరో తెలుసా.. అస్సలు ఊహించి ఉండరు!
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ రిలేషన్‌లో ఉన్నట్లు వచ్చిన వార్తలను నిజం చేస్తూ ఈ రోజు ఉదయం 9:42 AM కు ఈ ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చారు. దీనిపై అఫిషీయల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ.. అక్కినేని నాగార్జున తన X ఖాతా ద్వారా వీరిద్దరి నిశ్చితార్థం ఫొటోలు షేర్ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టారు. దీంతో ఈ వార్త వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే.. ఈ నిశ్చితార్థంలో చైతన్య, శోభిత వేసుకున్న సాంప్రదాయ డ్రెస్సులు డిజైన్ చేసింది బాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా. బాలీవుడ్, టాలీవుడ్‌ అంటూ ఇలా చాలా మంది స్టార్స్‌కి, వాళ్ళ పర్సనల్ ఈవెంట్స్‌కి మనీష్ మల్హోత్రానే బట్టలు డిజైన్ చేస్తాడు. ఇప్పుడు శోభిత – చైతన్య ఎంగేజ్మెంట్‌కి కూడా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసాడు. దీని గురించి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

ఆ పోస్ట్‌లో చైతన్య – శోభిత నిశ్చితార్థం ఫోటోని షేర్ చేస్తూ మనీష్ మల్హోత్రా.. ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత కార్మికుల నుంచి వీటిని తయారుచేసాము. శోభిత ఈ పర్సనల్ మూమెంట్ కోసం తన మూలాలు రిఫ్లెక్ట్ అవ్వాలని వీటిని ఎంచుకుంది. ఆమె ఉప్పాడ పట్టు చీర ధరించింది. తెలుగింటి అమ్మాయిలా జడ వేసుకుని కనకాంబరం పూలు పెట్టుకుంది. నాగచైతన్య సంప్రదాయమైన పట్టు పంచె లాల్చీ, కండువా ధరించాడు. వాటిని బంగారపు అంచుతో స్పెషల్‌గా డిజైన్ చేసాము అని చెప్పి ఈ కొత్త జంటకు కంగ్రాట్స్ తెలిపాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

(video link credits to manish malhotra instagram id)

Advertisement

Next Story

Most Viewed