పిఠాపురంలో విజయం దిశగా పవన్ కళ్యాణ్.. దర్శకుడు హరీష్ శంకర్ సంచలన పోస్ట్!

by Jakkula Samataha |
పిఠాపురంలో విజయం దిశగా పవన్ కళ్యాణ్.. దర్శకుడు హరీష్ శంకర్ సంచలన పోస్ట్!
X

దిశ, సినిమా : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయభేరి మోగించనున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించి, అసెంబ్లీలో అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నట్లు వచ్చే ఫలితాలను చూస్తే అర్థం అవుతుంది. ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్‌లో జనసేనాని తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వంగా గీతపై సుమారు 30 వేలకు పైగా ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. అయితే ఇదే ట్రెండ్ చివరి వరకు కొనసాగితే పిఠాపురంలో జనసేనా జెండా ఎగరడం ఖాయం.

దీంతో ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పన్‌కు సపోర్ట్ చేస్తూ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది అనే డైలాగ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇక ఇది చూసిన నెటిజన్లు పన్ గెలుస్తున్నాడనే డైరెక్టర్ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా పలువురు నటీనటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పవన్ కళ్యాణ్‌కు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed