Aishwarya Rajesh : దోషులకు సరైన శిక్ష పడాలి.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by sudharani |
Aishwarya Rajesh : దోషులకు సరైన శిక్ష పడాలి.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ప్రజెంట్ సోషల్ మీడియాలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆ నివేదిక ద్వారా బహిర్గతం అయ్యాయి. అప్పటి నుంచి పలువురు హీరోయిన్లు ఈ నివేదికపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ( Aishwarya Rajesh ) స్పందించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 12ఏళ్లు పూర్తవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలానుగుణంగా ఎన్నో మార్పులు జరిగాయి. అయితే.. ఇండస్ట్రీలో నేను ఎప్పుడు ఎలాంటి వేధింపులు ఎదుర్కోలేదు. వేధింపులకు పాల్పడినటువంటి దోషులకు సరైన శిక్ష పడాలి. సినీ పరిశ్రమకు సంబంధించి మహిళలకు నేను ఇచ్చే సలహా ఒక్కటే. మీరు ధైర్యంగా ఉండండి. మీతో మిస్ బిహేవ్ చెయ్యాలని ఎవరైనా చూస్తే వెంటనే రియాక్ట్ అవ్వండి. గట్టిగా మీ గొంతును వినిపించండి’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఐశ్వర్య రాజేశ్ ( Aishwarya Rajesh ) కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story