తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్

by Jakkula Mamatha |   ( Updated:2024-03-06 13:50:06.0  )
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్
X

దిశ, తిరుమల : ఇటీవల ప్రముఖ సినీ నటులు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు బాలీవుడ్ ముద్దుగమ్మ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దివంగత సినీ నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో జాన్వీ కపూర్ తనకు బంధువైన సినీ నటి మహేశ్వరి తో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేయగా, దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు. అదేవిధంగా సినీ నటుడు సంపత్ రాజ్, దర్శకుడు సందీప్ రెడ్డి కూడా శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. కాగా స్వామి వారి దర్శనానంతరం ఆలయ వెలుపలికి వచ్చిన జాన్వీ కపూర్, మహేశ్వరి, సంపత్ రాజ్ లను వారి అభిమానులు చుట్టుముట్టారు. వారితో సెల్ఫీలు తీసుకుంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు.

Read More..

సుప్రభాత సేవలో హీరోయిన్ మధుబాల

Advertisement

Next Story

Most Viewed