‘ఆమె మరణం నన్ను షాక్‌కు గురి చేసింది’.. రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించిన అల్లు అర్జున్

by Jakkula Mamatha |   ( Updated:2024-10-05 12:44:09.0  )
‘ఆమె మరణం నన్ను షాక్‌కు గురి చేసింది’.. రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించిన అల్లు అర్జున్
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రముఖ తెలుగు సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి (38) ఈ రోజు(శనివారం) ఉదయం గుండెపోటుతో మరణించారు. కూతురు మరణంతో రాజేంద్రప్రసాద్ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. కూతురి హఠాన్మరణంతో ఆయన కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హీరో జూ.ఎన్టీఆర్‌, సాయిధరమ్ తేజ్‌తో పాటు పలువురు సినీ రంగ ప్రముఖులు రాజేంద్రప్రసాద్‌ కుమార్తె మరణం తమను ఎంతో కలిచి వేసిందని.. ఈ బాధ నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని తెలిపారు.

ఈ క్రమంలో తాజాగా ఈ ఘటన పై స్టార్ హీరో అల్లు అర్జున్ స్పందించారు. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి హఠాన్మరణం తనను షాకింగ్‌కు గురిచేసిందని తెలిపారు. ఆమె మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం కూకట్‌పల్లిలోని గాయత్రి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్‌ ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని చెప్పారు. ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్‌కు, వారి కుటుంబ సభ్యులకు అల్లు అర్జున్ ధైర్యం చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed