బేబీలో హీరోయిన్ నేనే.. లక్షల్లో మోసం చేసిన డైరెక్టర్.. ఆధారాలతో సహా బయటపెట్టిన నటి..

by Sujitha Rachapalli |
బేబీలో హీరోయిన్ నేనే.. లక్షల్లో మోసం చేసిన డైరెక్టర్.. ఆధారాలతో సహా బయటపెట్టిన నటి..
X

దిశ, సినిమా: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ కీలకపాత్రల్లో నటించిన బేబీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఊహించిన దానికంటే రెట్టింపు సక్సెస్ అయింది. ముఖ్యంగా వైష్ణవి కెరీర్ కు బాగా హెల్ప్ అవుతుంది. అయితే ఈ సినిమాలో ముందుగా కథానాయికగా తనను సెలెక్ట్ చేశారని.. డైరెక్టర్ తనను మోసం చేశాడని ఆధారాలతో సహా బయటపెట్టింది యంగ్ యాక్ట్రెస్ గాయత్రి గుప్తా. నిజానికి షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సిరిన్ శ్రీరామ్ ఈ కథను నిజజీవితం ఆధారంగా రాసుకున్నాడని.. ' ప్రేమించొద్దు ' టైటిల్ ఫిక్స్ చేసి సాయి రాజేష్ కి వివరించాడని తెలిపింది.

అప్పటికే హీరోయిన్ గా తన పేరు ఫిక్స్ చేసిన సిరిన్.. స్కూల్ గర్ల్ గా ఎలా ఉంటానని లుక్ టెస్ట్ కూడా చేసినట్లు ఫొటోస్ చూపించింది. అదే మాదిరిగా స్కూల్ డ్రెస్ లో వైష్ణవిని ఈ మూవీలో డైరెక్టర్ చూపించాడని చెప్పుకొచ్చింది. తనను సాయి రాజేష్ దారుణంగా మోసం చేశాడని బాధ పడింది. కాగా గాయత్రి.. బేబీ డైరెక్టర్ దర్శకత్వంలో వచ్చిన కొబ్బరి మట్టలో కూడా నటించింది. అప్పుడు కూడా మూడు లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తానని చెప్పి 25వేలు మాత్రమే ఇచ్చినట్లు చెప్పింది బ్యూటీ.





Advertisement

Next Story

Most Viewed