- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి

X
దిశ, వరంగల్: రవీంద్ర భారతిని తలదన్నే రీతిలో కాళోజీ కళాక్షేత్రం నిర్మిస్తామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని హన్మకొండలో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రం పనులను సోమవారం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఏనుమాముల మార్కెట్ ఛైర్మన్ చింతం సదానందం, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్కు ధీటుగా వరంగల్ను అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. అన్నివర్గాల ప్రజలను ఆదుకోవడంతో పాటు బలోపేతం చేసేలా ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
Next Story