యాదాద్రిలో మంత్రి సత్యవతి రాథోడ్

by  |
యాదాద్రిలో మంత్రి సత్యవతి రాథోడ్
X

దిశ, నల్గొండ: యాద‌గిరిగుట్ట శ్రీ లక్ష్మీన‌ర్సింహ్మ‌స్వామి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌లో భాగంగా గురువారం ర‌థోత్స‌వం కార్యక్ర‌మానికి రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె బాలాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఆల‌య ఆర్చ‌కులు మంత్రికి పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. ఆశీర్వ‌చ‌నం చేసిన వేద‌పండితులు స్వామి వారి తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. ఆమె వెంట రాష్ట్ర ప్ర‌భుత్వ విప్ గొంగిడి సునీత‌, ఆల‌య ఈవో గీత తదితరులు ఉన్నారు.

Tags: Satyavathi Rathod, visit, yadagirigutta


Next Story

Most Viewed