రైతులకు ఈ యాసంగి పండగే…

by  |
రైతులకు ఈ యాసంగి పండగే…
X

దిశ వెబ్ డెస్క్: గత యాసంగితో పోలిస్తే ఈ ఏడాది సాగు భారీగా పెరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. యాసంగి విత్తన సేకరణ, లభ్యత పై మంత్రుల నివాసంలో నిర్వహించిన సమావేశానికి ఆయన హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రాష్ట్రంలో ప్రాజెక్టులు, చెరువులు నీటితో కలకల లాడుతున్నాయని అన్నారు. దీంతో రైతులకు కావాల్సినంత సాగునీరు అందుబాటులో ఉందన్నారు. కాబట్టి యాసంగి విత్తన సేకరణపై అధికారులు దృష్టి సారించాలన్నారు. వేరు శనగతో పాటు వరి, పప్పు,శనగ విత్తనాల సేకరణకు చర్యలు చేప్పట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికి 50వేల క్వింటాళ్ల వేరుశనగ, 73 క్వింటాళ్ల పప్పు శనగ విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ది శాఖ సిద్దం చేసిందన్నారు.


Next Story

Most Viewed