RTC బస్సులో భార్యలకు సీటు కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న భర్తలు

by Disha Web Desk 2 |
RTC బస్సులో భార్యలకు సీటు కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న భర్తలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టీసీ బస్సులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సులో కర్చీఫ్‌లు వేసి ఇద్దరు మహిళలు సీట్లు ఆపుకున్నారు. అనంతరం ఒకరి సీట్లో మరొకరు కూర్చొని గొడవ పడ్డారు. ఆ సమయంలో బస్సులోనే ఆ ఇద్దరి మహిళల భర్తలు.. భార్యల గొడవలో తలదూర్చి పొట్టు పొట్టు కొట్టుకున్నారు. కండక్టర్ ఎంత సర్దిచెప్పినా వినకుండా ఘర్షణకు పాల్పడ్డారు. దీంతో ఆగ్రహానికి గురైన కండక్టర్ బస్సును నేరుగా దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఉప్పల్ - తొర్రూరు బస్సులో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫీ జర్నీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాటి నుంచి రోజూ ఎక్కడో చోట గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కోసారి ప్రయాణికుల మధ్య గొడవలు జరుగుతుండగా.. మరోసారి ఏకంగా డ్రైవర్‌, కండక్టర్‌తో కూడా ఘర్షణకు దిగుతున్నారు.



Next Story

Most Viewed