HYD : సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్ట్..

by Disha Web Desk 4 |
HYD : సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ ఫోన్లు చోరీ చేసి ఇతర దేశాలకు ముఠా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఐదుగురు సూడాన్ దేశస్థులు సహా మొత్తం 17 మంది సెల్ ఫోన్ల చోరీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.1.75కోట్ల విలువైన 703 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం మీడియాకు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.



Next Story

Most Viewed