భూసేకరణ వేగవంతం చేయాలి: మంత్రి హరీశ్‌రావు

by Shyam |
భూసేకరణ వేగవంతం చేయాలి: మంత్రి హరీశ్‌రావు
X

దిశ, మెదక్: కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కాళేశ్వరం కాలువల పనులపై కలెక్టర్ ధర్మారెడ్డితో కలిసి మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువ పనులు వేగవంతం చేయాలన్నారు. అందుకు అవసరమైన భూమిని త్వరగా సేకరించాలని నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగితిన పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.

tag: Minister Harish Rao, gives order,officials, medak

Next Story

Most Viewed