- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
భద్రాద్రిలో దారుణం.. ఎంపీడీవో కారును ఢీకొట్టిన కంకర మిల్లర్ లారీ
దిశ,మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం కరకగూడెం మండల ఎంపీడీఓ శ్రీనివాస్ కారుకు తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం మణుగూెరు మండలం నుంచి కరకగూడెం ఎంపీడీఓ కార్యాలయానికి బయలుదేరిన ఎంపీడీఓ చిక్కుడుగుంట గ్రామం వద్ద కంకర మిల్లర్ లారీ కారును ఢీ కొట్టింది.
ఈ ఘటనలో ఎంపీడీఓ కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారు డ్రైవర్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ శ్రీనివాస్ క్షేమంగా బయటపడ్డారు. దేవుడి దయవల్ల ప్రాణాలతో బయట పడ్డామని ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు.
మణుగూరు నుంచి ఏటూరు నాగారం ప్రధాన రహదారిపై నిత్యం వందలాది మంది ప్రయాణం చేస్తుంటారు. ఈ ప్రధాన రహదారి పై బీటీపీఎస్ బొగ్గు వాహనాలు, కంకర్ వాహనాలు అధిక వేగంతో తిరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. వాహనాలు నడిపే ఏ ఒక్క డ్రైవర్కూ సరైన లైసెన్స్లు లేవని స్థానికులు వాపోతున్నారు. లైసెన్స్ లేని డ్రైవర్లు అధిక వేగంతో రహదారిపై వెళ్తున్న క్రమంలో వారిపై చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అప్పుడే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయగలమని, లేనియెడల భవిష్యత్తులో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుందన్నారు. అయితే, ఎంపీడీఓ కారును ఢీకొట్టిన కంకర మిల్లర్ వాహనం స్థానిక బయ్యారంనకు చెందిన వ్యాపారవేత్త ముక్కు నర్సారెడ్డిది అని తెలుస్తోంది.