- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
పదేళ్ల అనాథ బాలికపై అత్యాచారం..ఆలస్యంగా వెలుగులోకి
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి జిల్లా కేంద్రంలోని బాలసదన్ లో దారుణం చోటు చేసుకుంది. అనాథ బాలికపై జిల్లా లీగల్ సర్వీసెస్ కు చెందిన అటెండర్ అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 14న బాలసదన్ లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీపీఓతో పాటు మరికొందరు హాజరయ్యారు. అదే కార్యక్రమానికి నిందితుడు కూడా డీసీపీ వో తో పాటు వచ్చాడు.
అదే సమయంలో ఓ బాలిక రూమ్ లో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే విషయాన్ని ఏడుస్తూ వచ్చి విషయాన్ని బాలసదన్ సిబ్బందికి చెప్పింది. అయిన కూడ వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. విషయం బయటకు వస్తే అందరూ ఉద్యోగాలు పోతాయంటూ అందులోని ఓ అధికారి హెచ్చరించినట్లు తెలుస్తోంది. విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు బాధితురాలిని భువనగిరి బాలసదన్ నుంచి వలిగొండలోని ఒక ప్రైవేటు అనాథాశ్రమానికి తీసుకువెళ్లారు. అనంతరం విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఫిర్యాదు రావడంతో భువనగిరి పట్టణ పోలీసులు ఈ ఘటనపై ఫోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.