ప్రాణం తీసిన ఈత సరదా..

by Aamani |
ప్రాణం తీసిన ఈత సరదా..
X

దిశ, నాగారం : మండలం వర్ధమానుకోట గ్రామంలో బిక్కేరు వాగు చెక్ డ్యాం నీటి ఉధృతి లో పడి కమ్మంపాటి మణీశ్వర్ (11)అనే బాలుడు గల్లంతయ్యాడు. ఆదివారం సాయంత్రం సెలవు రోజని గ్రామానికి చెందిన నలుగురైదుగురు బాలురు కలిసి ఏటిని చూడటానికి వెళ్లారు. నీటిలోకి దిగి ఆడుకుంటుండగా వారిలో ఒక బాలుడు మిగతావాళ్ల కళ్లముందే నీటి ఉధృతి కి కొట్టుకొని పోవడంతో మిగతా వారు భయంతో బాలుడు గల్లంతు అయిన విషయాన్ని ఎవరితో చెప్పకుండా ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు.మనీశ్వర్ తల్లిదండ్రులైన కమ్మంపాటి నాగరాజు ఉపేంద్ర పొలానికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మనీశ్వర్ కనిపించక పోవడం తో అతనితో వెళ్లిన వారిని వాకబు చేయగా పొంతన లేని సమాధానాలు చెప్పగా వారిని పోలీసులు గట్టిగా అడుగగా నీటిలో గల్లంతైన విషయాన్ని తెలిపారు.చెక్ డ్యాం వద్ద మునీశ్వర్ కు చెందిన చొక్కా,కీ చెయిన్ లభించగా, డెడ్ బాడీ కోసం వలలతో గాలింపు చేపట్టారు.మృతదేహం చెక్ డ్యాం ముందు వైపు లభ్యమవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Advertisement

Next Story

Most Viewed