పేషెంట్ నరకయాతన.. ఐదు గంటలు బెంచీపైనే

by  |
పేషెంట్ నరకయాతన.. ఐదు గంటలు బెంచీపైనే
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ సోకి పరిస్థితి విషమించి చనిపోయిన వారు కొందరైతే.. వైద్యుల నిర్లక్ష్యం, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా మరికొందరు చనిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే సోమవారం చోటుచేసుకుంది. కానీ అదృష్టవశాత్తు పేషెంట్‌ బతికాడు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. ఐదుగంటల పాటు జిల్లా ఆసుపత్రి బెంచీపైనే నరకయాతన అనుభవించాడు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఆసుపత్రికి చేరుకోవడంతో, వైద్య సిబ్బంది స్పందించి చికిత్స అందించారు. అనంతరం బాధితుడిని అంబులెన్సులో హైదరాబాద్‌కు తరలించారు.


Next Story