AP News:జైలు నుంచి పిన్నెల్లి విడుదల.. హడావిడిగా అక్కడికి పయనం

by Jakkula Mamatha |   ( Updated:2024-08-24 07:47:11.0  )
AP News:జైలు నుంచి పిన్నెల్లి విడుదల.. హడావిడిగా అక్కడికి పయనం
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ (శనివారం) జైలు నుంచి విడుదలయ్యారు. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో 55 రోజులుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న ఆయన ఇవాళ బయటకు వచ్చారు. పలు కండీషన్లతో ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జైలులో నుంచి బయటకి వచ్చిన వెంటనే‌ పిన్నెల్లి హడావిడిగా కారులో మాచర్లకి బయలుదేరి వెళ్లారు. పిన్నెల్లిని పరామర్శించేందుకు మాజీ మంత్రులు కాకాణి గోవర్దన్ రెడ్డి, అనిల్ కుమార్ జైలు వద్దకి వెళ్లారు. ఈ సందర్భంగా పిన్నెల్లికి వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అయితే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డికి నిన్ననే (శుక్రవారం) హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా, సంబంధిత పత్రాలు జైలు అధికారులకు ఆలస్యంగా అందడంతో ఈ రోజు విడుదలవ్వడం జరిగింది.

Advertisement

Next Story