అందుకే హైదరాబాద్‌లో ఓటింగ్ తగ్గింది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
అందుకే హైదరాబాద్‌లో ఓటింగ్ తగ్గింది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కొంత పోలింగ్ శాతం తగ్గిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం నాంపల్లిలోని పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో నివాసం ఉంటే ఎక్కువ మంది ఏపీ వాళ్లు కావడం, ఓట్ల కోసం అందరూ అక్కడికి వెళ్లడంతో నగరంలో ఓటింగ్ శాతం తగ్గిందని అన్నారు. వేసిన వారంగా మోడీకే వేశామని బహిరంగంగా చెబుతున్నారు. అన్ని ప్రాంతాల్లో మార్పు మొదలైంది. మోడీ నాయకత్వాన్ని తెలంగాణ కోరుకుంటోంది. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా ఈసారి గ్రామాల్లో కూడా బీజేపీకి భారీగా ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ కార్యకర్తలు సైతం రాష్ట్రంలో ఎక్కడా రేవంత్ రెడ్డి మాటలు కూడా నమ్మలేదని విమర్శించారు. మెజార్టీ ఓట్లు మోడీవైపే మొగ్గుచూపారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఏదైనా సరే.. ప్రధానిగా మోడీనే ఉండాలనే అభిప్రాయం అందరిలోనూ ఏర్పడిందని అన్నారు.

Read More..

ఒక వర్గానికి చెందిన వారి ఓట్లను మాత్రమే డిలీట్ చేయడం దుర్మార్గం!.. కిషన్ రెడ్డి



Next Story