Raksha Bandhan : అన్నాతమ్ముళ్లు లేనివారు ఈ చెట్లకు రాఖీ కట్టండి.. అంతా శుభమే అంటున్న జ్యోతిష్యులు

by Prasanna |
Raksha Bandhan : అన్నాతమ్ముళ్లు  లేనివారు ఈ చెట్లకు రాఖీ కట్టండి.. అంతా శుభమే అంటున్న జ్యోతిష్యులు
X

దిశ, ఫీచర్స్ : రక్షాబంధన్ అనేది అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక. తోడబుట్టిన వాళ్లు సంతోషంగా ఉండాలని, వారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అక్కా చెల్లెల్లు, అన్న తమ్ముళ్లకు కట్టే రాఖీ నే ఈ రక్షాబంధన్.

రాఖీ అనగానే ద్రౌపది, శ్రీకృష్ణుల అన్నాచెల్లెల బంధం గురించి ఎక్కువగా చెబుతుంటారు. ఎందుకంటే, ఇది చాలా గొప్ప బంధం. శిశుపాలుడి మీద శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం వేసినప్పుడు చూపుడు వేలుకు గాయమవుతుంది. అది చూసిన ద్రౌపది వెంటనే ఆమె పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టులా కట్టిందట. అందుకు వాళ్ళ బంధాన్ని గొప్పగా చెబుతారు.

అయితే, అన్నాతమ్ముళ్ళు లేని వారు ఆ రోజున ఫీల్ అవుతుంటారు. వారికీ కూడా ఎవరైనా అన్న, తమ్ముడు ఉంటే బాగుండేది అని బాధ పడుతుంటారు. ఇలాంటి వారికి శుభ వార్త. తోబుట్టువులగా ఎవరూ లేకపోతే వేప, మర్రి, అరటి, తులసి మొక్కలకు రాఖీ కట్టవచ్చు. వీటిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఉంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ చెట్లకు రాఖీ కడితే దేవ దేవుళ్ళు ఎంతో సంతోషిస్తారని చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.


Read more...

అక్కా.. నీదే బాధ్యత.. రాఖీ పండుగ స్పెషల్.. బ్రదర్స్‌ను ఇలా సంతోష పెట్టండి..!

Advertisement

Next Story

Most Viewed