అంతా రాధికా మర్చంట్ మెహందీ ముచ్చటే.. అందులో స్పెషల్ ఏమిటంటే?

by Jakkula Samataha |
అంతా రాధికా మర్చంట్ మెహందీ ముచ్చటే.. అందులో స్పెషల్ ఏమిటంటే?
X

దిశ, ఫీచర్స్ : అనంత్ అంబానీ, రాధికల వివాహ వేడుక చాలా ఘనంగా జరుగుతోంది. పెద్ద ఎత్తున సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరై నవదంపతులను దీవిస్తున్నారు. ఇక అంబానీ ఇంట పెళ్లి అంటే మాటలా.. ప్రపంచవ్యాప్తంగా ముచ్చటించుకునేలా ఉండాలి. అలానే చేస్తున్నాడు ముఖేష్ అంబానీ. పెళ్లీలో ప్రతీది చాలా కొత్తగా,ఎవరూ చేయని విధంగా చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. వివాహ వేధిక నుంచి వారు వేసుకున్న డ్రెస్సింగ్, చెప్పులు, నగల నుంచి ఆఖరకు మెహందీ కూడా వార్తల్లో నిలుస్తుంది. అయితే పెళ్లి కూతురు రాధిక మర్చం రెండు చేతులకు ఉన్న గోరింటాకు ఇప్పుడు ప్రతీ ఒక్కరినీ ఆకర్షిస్తుంది.

పెళ్లి అనగానే ప్రతి ఆడపిల్ల తన చేతులకు గోరింటాకు పెట్టుకుంటుంది.అలానే రాధిక మర్చంట్ కూడా తన చేతులను గోరింటాకుతో నింపేసింది. అయితే ఆమె మెహందీ పెట్టుకుని రెండు మూడు రోజులు అవుతున్నా, అది మాత్రం రంగు మారకుండా ఇప్పుడే పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. మరి అది ఎలా సాధ్యం అయ్యిందని అందరూ దాని గురించే ముచ్చటిస్తున్నారు. కాగా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గోరింటాకు రంగు మారకుండా ఉండటానికి ఆమె ఓ చిట్కా పాటించిందంట. అది ఏమిటంటే? పచ్చి ఆవనూనను తీసుకొని, మెహందీ పెట్టుకున్న తర్వాత, అది పూర్తిగా ఆరాక, నూనెను అప్లై చేయాలంట. తర్వాత మెహందీ కడిగేసి, మళ్లీ చేతులకు ఆవనూనెను అప్లై చేయాలి. కొద్ది సేపు ఇలానే ఉంచి, తర్వాత చేతులు కడాలి. ఇలా చేయడం వలన మెహందీ రంగు మారకుండా ఉంటుందంట.

Advertisement

Next Story

Most Viewed