ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఆరుగురు మృతి

by karthikeya |
ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఆరుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక (Karnataka)లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడం (Car Accident)తో ఆ కార్లలో ఉన్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు (Police) తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక తుమకూరు జిల్లా మధుగిరి (Madhugiri) తాలూకాలో ఆదివారం ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ కుటుంబానికి చెందిన నలుగురు మరణించగా.. మరో కారులోని ఇద్దరు మరణించారు. కాగా.. మరణించిన వారిలో ముగ్గురు పురుషులు, ఎనిమిదేళ్ల చిన్నారి, ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంలో గాయపడిన చిన్నారి సహా నలుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై మధుగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story