విమర్శకుల నోరు మూయించిన జ్యోతిక

by  |
విమర్శకుల నోరు మూయించిన జ్యోతిక
X

హీరోయిన్ జ్యోతిక వ్యాఖ్యలు ఈ మధ్య దుమారం రేపాయి. సినిమా షూటింగ్‌లో భాగంగా తంజావూర్ దేవాలయాన్ని సందర్శించిన ఆమె.. అదే సమయంలో తంజావూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. కానీ టెంపుల్ ఎంత శుభ్రంగా ఉందో.. హాస్పిటల్ అంత ఘోరంగా ఉందని ఓ కార్యక్రమంలో ప్రసంగించగా దీనిపై దుమారం చెలరేగింది. దీనిపై కొందరు తనకు సపోర్ట్ చేయగా మరికొందరు విమర్శించారు.

కాగా, జ్యోతిక తాజాగా తంజావూర్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు రూ. 25 లక్షల విరాళం అందించారు. ఆస్పత్రిలో బెడ్స్, వైద్య పరికరాలు సమకూర్చడంతో పాటు పీడియాట్రిక్స్ సెక్షన్ రెనోవేషన్‌కు ముందుకొచ్చారు. హాస్పిటల్‌లో చిల్డ్రెన్స్ పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో విమర్శకుల నోరు మూత పడిందని.. ఈ విరాళం ద్వారా జ్యోతిక సరైన బదులిచ్చారని అంటున్నారు నెటిజన్లు.


Next Story