జియో మరో డీల్.. ఏడీఐఏ 1.16 శాతం కొనుగోలు!

by  |
జియో మరో డీల్.. ఏడీఐఏ 1.16 శాతం కొనుగోలు!
X

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ జియో మరో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆదివారం అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ(ఏడీఐఏ) జియోలో 1.16 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. ఈ వాటా విలువ రూ. 5,683.50 కోట్లు. గడిచిన ఏడువారాల్లో ఏడు పెట్టుబడులను సేకరించిన జియో ఈసారి తొందరగానే ఎనిమిదో పెట్టుబడిని దక్కించుకుంది. దీంతో మొత్తం అన్ని పెట్టుబడుల విలువ రూ. 97,885.65 కోట్లను సంపాదించగలిగింది. ఈ పెట్టుబలతో జియో ప్లాట్‌ఫామ్ ఈక్విటీ విలువ రూ .4.91 లక్షల కోట్లుగా, ఎంటర్‌ప్రైజ్ విలువ రూ .5.16 లక్షల కోట్లకు చేరింది. మొత్తం ఎనిమిది ఒప్పందాలతో జియో 21.06 శాతం వాటాను విక్రయించింది. అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ 1976 నుంచి గవర్న్‌మెంట్ ఆఫ్ అబుదాబి తరపున పెట్టుబడులను పెడుతోంది.


Next Story

Most Viewed