నేను కేసీఆర్‌ను క‌ల‌వ‌లేదు : కోదండ‌రాం

by Anukaran |
Professor Kodandaram
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తాను కలిసిన‌ట్లుగా వ‌స్తున్న వార్తల్లో అవాస్తవమని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం స్పష్టం చేశారు. ప‌ట్టభ‌ద్రుల‌ను క‌న్ఫ్యూజ్ చేయ‌డానికే కొంత‌మంది ఇలాంటి దుష్ర్పచారాల‌కు తెర‌లేపిన‌ట్లుగా తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. పట్టభద్రులెవరూ దుష్ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. శనివారం రాత్రి తాను హన్మకొండలోనే ఉన్నానని, రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటం మంచి పద్ధతి కాదన్నారు. తన గెలుపును ఓర్వలేని వారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కోదండరాం తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed