లండన్‌లో తెలంగాణ వైభవం.. ఘనంగా బోనాలు, తొట్టెల ఊరేగింపు

by Shyam |
లండన్‌లో తెలంగాణ వైభవం.. ఘనంగా బోనాలు, తొట్టెల ఊరేగింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ వైభవం లండన్‌లో గ్రాండ్‌గా వెల్లివెరిసింది. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్ డమ్ (TAUK) ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం బోనాల పండుగను లండన్ వీధుల్లో తొట్టెలను ఊరేగిస్తూ ఘనంగా నిర్వహిస్తామని అధ్యక్షులు రత్నాకర్ కడుదుల తెలిపారు. బోనాల సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రజలంతా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకున్నామన్నారు. కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమయంలో టాక్ కార్యవర్గ సభ్యులు కొవిడ్ నిబంధనలను పాటిస్తూ స్థానిక ఆలయంలో అమ్మవారికి బోనాలను సమర్పించి.. అందరినీ చల్లగా చూడాలని కోరుకున్నట్లు ఉపాధ్యక్షురాలు శుష్మణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని బోనాలు సమర్పించిన ప్రతి టాక్ సంస్థ ఆడబిడ్డలందరికీ శుష్మణ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. చిన్న పిల్లలు టాక్ జెండాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహించే బోనాల పండుగను కొవిడ్ నేపథ్యంలో టాక్ తరపున ముఖ్య నాయకులు సురేష్ బుడుగం-స్వాతి దంపతుల ఇంట్లో సంప్రదాయ బద్దంగా అమ్మవారి పూజ నిర్వహించి ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. సంస్థ ఆవిర్భావం నుండి ప్రత్యేక శ్రద్ధతో సంస్థను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్సీ కవితకు టాక్ నాయకుడు నవీన్ రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు.

ఇండియా నుండి వచ్చిన కుటుంబ సభ్యులు తెలంగాణ సంస్కృతికి లండన్‌లో టాక్ చేస్తున్న సేవలను అభినందించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షురాలు శుష్మణ రెడ్డి, మల్లారెడ్డి, నవీన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, స్వాతి, సుప్రజ, సురేష్ బుడగం, రాకేష్ పటేల్, సత్యపాల్, హరిగౌడ్, గణేష్, రవి రెటినేని, రవి పులుసు, మాధవ్ రెడ్డి, వంశీ వందన్, భూషణ్, అవినాష్, వంశీ కృష్ణ, పృథ్వీ, శ్రీ లక్ష్మి, విజిత, క్రాంతి, భరత్, వంశీ పొన్నం, చింటూ, రమ్య, స్వప్న, లాస్య, పూజిత, బిందు, మాధవి ఉన్నారు.



Next Story