నవీన్ కుటుంబాన్ని ఆదుకోవాలి..!

by  |
నవీన్ కుటుంబాన్ని ఆదుకోవాలి..!
X

దిశ, మహేశ్వరం: భారీ వర్షం కారణంగా నాళాల్లో కొట్టుకుపోయిన నవీన్ అంత్యక్రియలు బుధవారం మీర్‎పేట్ స్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల్లో బీజేపీ నాయకులు పాల్గొని నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బీజేపీ మహిళ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి మాట్లాడుతూ.. నవీన్ మృతి కుటుంబానికి తీరని లోటన్నారు. నవీన్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్‎రూమ్ ఇళ్లు ,ఇద్దరు పిల్లల చదువుకు అయ్యే ఖర్చు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహానగరం, విశ్వనగరం అంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నారని.. కానీ, హైదరాబాద్‎లో ఉండే ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయపడాల్సి వస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Next Story