దారుణం: నదిలో దిగిన నలుగురు విద్యార్థులు.. శవాలుగా తేలారు

by srinivas |   ( Updated:2021-06-28 04:21:11.0  )
దారుణం: నదిలో దిగిన నలుగురు విద్యార్థులు.. శవాలుగా తేలారు
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా లంకలగన్నవరం గ్రామంలో విషాదం చోటు చేసకుంది. పదో తరగతి చదువుతున్న నలుగురు బాలురు నదిలో స్నానానికి దిగడంతో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయారు. గోదావరి నదీతీరానా నలుగురు విద్యార్థుల చెప్పులు, బట్టలు కనిపించడంతో స్థానికులు పొలీసులకు సమాచారం అందించారు. పడవలతో స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడంతో నది ఒడ్డున విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed