- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Tirumala Samacharam: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. స్వామి వారి దర్శనానికి 8 గంటల సమయం
by Shiva |
X
దిశ, వెబ్డెస్క్: ఆపద మొక్కులవాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం శ్రీవారిని దర్శనానికి జనం మోస్తరుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 8 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 నుంచి 3 గంటలకు పైగానే సమయం పడుతోంది. అదేవిధంగా శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 8 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనానికి వేచి చూస్తున్నారు. శుక్రవారం స్వామి వారిని 61,576 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 23,412 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.54 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Advertisement
Next Story