Crime News : ఘోర రోడ్డు ప్రమాదం.. బాలుడి మృతి

by Rajesh |   ( Updated:2024-07-13 07:10:42.0  )
Crime News : ఘోర రోడ్డు ప్రమాదం.. బాలుడి మృతి
X

దిశ, జన్నారం : జన్నారం మండలంలోని టిజి పల్లి స్టేజి వద్ద శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం అర్దరాత్రి మందమర్రి నుండి నార్నూర్ పోలీస్ స్టేషన్‌లో విధులకు హాజరుకావడానికి ఎపి01ఎబి 8976 నెంబర్ గల కారులో వెళ్తున్న సమయంలో టిజిపల్లి వద్ద కారు చెట్టును డీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న జాదవ్ జశ్వంత్ రాజు(10) బాలుడు మృతి చెందగా, జాదవ్ గోపిచంద్ (38), జాదవ్ గీత (35), జిలాబాయి (70), ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని 108 సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed