AP News:మతిస్థిమితం లేని వృద్ధుడు రైలు కింద పడి మృతి

by Jakkula Mamatha |
AP News:మతిస్థిమితం లేని వృద్ధుడు రైలు కింద పడి మృతి
X

దిశ ప్రతినిధి,ధర్మవరం: పట్టణంలోని సుందరయ్య నగర్‌కు చెందిన పెదగొండ గారి నరసింహులు (78) మతిస్థిమితం లేకపోవడంతో పట్టణంలోని రేగాటిపల్లి రైల్వే గేట్ సమీపాన రైలు కిందపడి బుధవారం మృతి చెందడం జరిగిందని రైల్వే జీఆర్పీ పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామి కృష్ణ మాట్లాడుతూ మృతి చెందిన వ్యక్తి సొంత గ్రామం చెన్న కొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో ఉండి, కొన్ని నెలల కిందట ధర్మవరం పట్టణం సుందరయ్య నగర్‌లో నివసించేవాడు. మృతునికి 2019లో డెంగీ జ్వరంతో నరాల బలహీనత, ఆస్తమా, మూత్రపిండాల వ్యాధులు రావడం జరిగిందని, అనంతపురం తదితర చోట్ల వైద్య చికిత్సలు అందించిన ఫలితం లేకపోయిందని తెలిపారు. దీంతో మతిస్థిమితం లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు కూడా తెలపడం జరిగిందని వారు తెలిపారు.

ఎక్కడికి పోతాడో? ఎప్పుడు వస్తాడో? తెలియని పరిస్థితి ఉండేదని, దీంతో అనుకోకుండా రైల్వే పట్టాల వద్ద వచ్చి ఉండడంతో గుర్తు తెలియని రైలు ఢీకొట్టడం జరిగిందని తెలిపారు. కుటుంబ సభ్యులను విచారించి ఇది ఆత్మహత్యగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సేవ పరీక్ష అనంతరం శవాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హిందూపురం జి ఆర్ పి పోలీసులు తెలిపారు. మృతునికి ముగ్గురు కుమార్తెలు ఒక కొడుకు ఉన్నారని, కొడుకు జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడని వారు తెలిపారు. సమాచారాన్ని కొడుకుతో పాటు కుటుంబ సభ్యులు కూడా తెలియజేయడం జరిగిందని తెలిపారు.

Next Story