రోడ్డు ప్రమాదంలో బీ ఫార్మసీ విద్యార్థిని మృతి

by Julakanti Pallavi |   ( Updated:2024-08-29 13:34:49.0  )
రోడ్డు ప్రమాదంలో బీ ఫార్మసీ విద్యార్థిని మృతి
X

దిశ, గరిడేపల్లి: రోడ్డు ప్రమాదంలో బీఫార్మసీ విద్యార్థిని మృతి చెందిన సంఘటన గురువారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని అప్పన్నపేట గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం గణపవరం గ్రామానికి చెందిన పిడమర్తి స్రవంతి(21), పాలకవీడు మండలం గుడుగుంట్ల పాలెం గ్రామానికి చెందిన బంక నాగరాజు(25) ఇరువురు కలిసి ద్విచక్ర వాహనం మీద ప్రయాణిస్తున్నారు. హుజూర్ నగర్ నుంచి గరిడేపల్లి వచ్చే క్రమంలో అప్పన్నపేట గ్రామ శివారుకి చేరుకునేసరికి హుజూర్ నగర్ నుంచి మిర్యాలగూడ వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టడం తో స్రవంతి అక్కడికక్కడే మరణించింది. తీవ్ర గాయాలకు గురైన నాగరాజును చికిత్స నిమిత్తం హుజూర్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని తెలిపారు. కాగా ప్రస్తుతం నాగరాజు హుజూర్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement

Next Story