మోటర్ తీయబోయిన యువకుడు మళ్లీ తిరిగి రాలే..

by Julakanti Pallavi |   ( Updated:2024-08-29 10:19:21.0  )
మోటర్ తీయబోయిన యువకుడు మళ్లీ తిరిగి రాలే..
X

దిశ అడ్డగూడూరు: బావిలో పడి యువకుడు మృతి చెందిన సంఘటన అడ్డగూడూరు మండల పరిధిలోని లక్ష్మీదేవి కాల్వలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పర్రెపాటి వెంకటేష్ (28) రోజువారిగానే పొలం దగ్గరికి వెళ్ళాడు. బావిలో మోటర్ నడకపోవడంతో దిగి మోటర్ ను తీస్తున్న తరుణంలో ప్రమాదవశాత్తు నీళ్ళల్లో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న గ్రామస్తులు మృతదేహాన్నిబయటకు తీశారు.

Advertisement

Next Story