బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం

by Sridhar Babu |
బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం
X

దిశ,కార్వాన్ : బస్సు ఢీకొని ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రాజు కథనం ప్రకారం.. మంగళవారం సాయంత్రం లంగర్ హౌజ్ లోని ఫ్లోర్ మిల్ దగ్గర ఉన్న రంగనాయక దేవస్థానం నుండి ఇందిరానగర్ వైపు ఓ గుర్తు తెలియని వ్యక్తి (70) రోడ్డును క్రాస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో పెద్ద మంగళారం నుండి వస్తున్న మెహిదీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed