Biden: అణు కేంద్రాలపై దాడులకు మద్దతివ్వబోము.. యూఎస్ అధ్యక్షుడు బైడెన్

by vinod kumar |
Biden: అణు కేంద్రాలపై దాడులకు మద్దతివ్వబోము.. యూఎస్ అధ్యక్షుడు బైడెన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ దేశ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడబోతుందనే కథనాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి తాము మద్దతివ్వబోమని స్పష్టం చేశారు. అయితే ఇరాన్‌పై ఆంక్షలు విధిస్తామని తెలిపారు. ఈ మేరకు ఈ పశ్చిమాసియాలో ఏర్పడిన సంక్షోభం దృష్యా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని బుధవారం జీ-7 దేశాల అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌లోనే బైడెన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బైడెన్ తో పాటు జీ-7 దేశాలు సైతం ఇరాన్ దాడిని ఖండించాయి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరాయి. దౌత్యపరమైన పరిష్కారం ఇప్పటికీ ఆచరణలోనే ఉందని తెలిపాయి. ఇరాన్ క్షిపణి దాడికి ప్రతిస్పందించే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని, కానీ అణు కేంద్రాలపై దాడులు సరికాదని స్పష్టం చేశాయి. ఈ విషయమై త్వరలోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడతానని బైడెన్ తెలిపారు.

Next Story

Most Viewed