విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

by Mahesh |
విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
X

దిశ, ఎం తుర్కపల్లి: యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామం శివారులో పెట్రోల్ పంప్ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మాదాపురం గ్రామానికి చెందిన జలిగం రాజు మేకల శ్రీకాంత్ బైక్ పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు బైక్ ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న జలిగం రాజు (30)అక్కడికి అక్కడే మృతి చెందాడు. శ్రీకాంత్ తీవ్రంగా గాయపడడంతో హాస్పిటల్‌కి తరలించామని ఎస్సై రాఘవేంద్ర గౌడ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed