ఇదెక్కడి విచిత్రం సామి.. కారుపై గీతలు గీశారని చిన్నారులపై కేసు

by Shiva |
ఇదెక్కడి విచిత్రం సామి.. కారుపై గీతలు గీశారని చిన్నారులపై కేసు
X

దిశ, హనుమకొండ: కారుపై చిన్నారులు గీతలు పెట్టారని పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన హనుమకొండ పట్టణంలోని రాంనగర్ పరిధిలో చోటుచేసుకుంది. వివారల్లోకి వెళితే.. రాంనగర్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సీఐడీ విభాగంలో పనిచేసే కానిస్టేబుల్ నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో చిన్నారులు ఆడుకుంటుండగా కానిస్టేబుల్‌ పార్క్ చేసిన కారుపై గీతలు పడ్డాయి. దీంతో అతడు రెండేళ్ల నుంచి 9 ఏళ్ల చిన్నారులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అనంతరం పిల్లల తల్లిద్రండులను స్టేషన్‌కు పిలిపించగా వారిపై కేసు నమోదైన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అభంశుభం తెలియని చిన్నారులపై కేసు నమోదు చేయడం ఏంటని తల్లిదండ్రులు, కాలనీ వాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed