‘బాలుగారి మధుర గాత్రం చెవులకు వినిపిస్తూనే ఉంది’.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
‘బాలుగారి మధుర గాత్రం చెవులకు వినిపిస్తూనే ఉంది’.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: నేడు(సెప్టెంబర్ 25) దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి(SP Balasubrahmanyam) వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, తెలుగు రాష్ట్రాల మంత్రులు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) గుర్తు చేసుకున్నారు. గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(SP Balasubrahmanyam) వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళి అర్పించారు. సినీ సంగీత చరిత్రలో ఒక సువర్ణ శకాన్ని తన పరం చేసుకున్న మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అని కొనియాడారు. మైమరపింపజేసే ఆయన మధుర గాత్రం.. పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉంది అని అన్నారు. బాలుగారి వర్ధంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళి అర్పిస్తున్నాను అని సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

Next Story

Most Viewed