పురుడు పోసిన 108 సిబ్బంది..తల్లి బిడ్డ క్షేమం

by Aamani |
పురుడు పోసిన 108 సిబ్బంది..తల్లి బిడ్డ క్షేమం
X

దిశ,ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సిరికొండ గ్రామానికి చెందిన పోతురాజు అనిత 30 అనే గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కి కాల్ చేయగా సమాచారం అందుకున్న 108 సిబ్బంది టెక్నీషియన్ శ్రీకాంత్ పైలెట్ మనోజ్ లు ఘటన స్థలానికి చేరుకున్నారు. చికిత్స కోసం సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్ లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని హాస్పిటల్ వైద్యులు ప్రకటించారు. సకాలంలో స్పందించి పురుడు పోసిన అంబులెన్స్ టెక్నీషియన్ శ్రీకాంత్, పైలెట్ మనోజ్ లను కుటుంబ సభ్యులు,హాస్పిటల్ సిబ్బంది అభినందించారు.

Next Story

Most Viewed