కల్వర్టును ఢీకొట్టిన కారు... వ్యక్తి మృతి

by Kalyani |   ( Updated:2024-10-04 14:36:43.0  )
కల్వర్టును  ఢీకొట్టిన కారు... వ్యక్తి మృతి
X

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన జాజిరెడ్డిగూడెం మండలం అడివెంల వద్ద శుక్రవారం సాయంత్రం జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ మండలం పెద్ద నెమిల గ్రామానికి చెందిన రేసు రాములు గౌడ్ (49) సూర్యాపేటలో స్థిరపడ్డాడు. తుంగతుర్తిలో శుభకార్యానికి భార్య అంజమ్మ, మనువరాలితో కలిసి శుక్రవారం హాజరై సాయంత్రం తిరిగి సూర్యాపేటకు వెళ్ళుతున్నాడు. ఈ క్రమంలో అడివెంల గ్రామం వద్ద కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది దీంతో రాములు గౌడ్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకు గాయాలు కావడంతో సూర్యాపేటకు మెరుగైన చికిత్స కోసం తరలించారు. కాగా, మృతునికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఈ సంఘటనతో పెద్ద నెమిల, సూర్యాపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతదేహాన్ని సూర్యాపేటకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed