నేను గ్రీన్‌బుక్‌ పెడతా.. లోకేశ్‌కు కౌంటర్‌గా అంబటి కీలక నిర్ణయం

by srinivas |   ( Updated:2024-10-04 15:54:43.0  )
నేను గ్రీన్‌బుక్‌ పెడతా.. లోకేశ్‌కు కౌంటర్‌గా అంబటి కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి లోకేశ్(Minister Nara Lokesh) రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడిపిస్తున్నారని, కానీ తాను గ్రీన్‌బుక్‌ పెట్టి కష్టపడ్డ ప్రతి కార్యకర్త పేరు రాసుకుంటా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) అన్నారు. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందన్నారు. దేవుడిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును దేవుడు శిక్షించకుండా ఉంటాడా అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని, గెలుపు వైపు తొలి అడుగు ఇక్కడ నుంచే పడుతుందని అంబటి రాంబాబు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed