రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీటీసీ శివరామ్ మృతి

by Kalyani |
రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీటీసీ శివరామ్ మృతి
X

దిశ, నేరేడుచర్ల ( పాలకవీడు) : రోడ్డు ప్రమాదంలో లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీ కొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని కల్మెట్ తండా వద్ద చోటుచేసుకుంది. పాలకవీడు ఎస్సై లక్ష్మీ నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం… జాన్ పహాడ్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ ధరావత్ శివరాం (58) తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి వస్తుండగా.. దామరచర్ల వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టింది. దీంతో శివరామ అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ కత్తుల అంజయ్యను అదుపులోకి తీసుకొని మృతుడు పెద్ద కుమారుడు ధరావత్ ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed