Road Accident: అదుపుతప్పి బస్సు బోల్తా.. నలుగురు మృతి, 23 మందికి గాయాలు

by Shiva |
Road Accident: అదుపుతప్పి బస్సు బోల్తా.. నలుగురు మృతి, 23 మందికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలైన ఘటన ఒడిశా రాష్ట్రం (Odisha State) లోని బాలేశ్వర్ జిల్లా (Baleshwar)లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యూపీ నుంచి పూరీకి ప్రయాణికులతో బస్సు వెళ్తోంది. ఈ క్రమంలోనే బస్సు బాలేశ్వర్ (Baleshwar) సమీపంలోకి రాగానే ఒక్కసారిగా అతివేగంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో మొత్తం నలుగురు ప్రయాణికులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed