Road accident : ఒకరు మృతి..మరొకరికి తీవ్ర గాయాలు

by Kalyani |
Road accident : ఒకరు మృతి..మరొకరికి తీవ్ర గాయాలు
X

దిశ,అల్లాదుర్గం : ఆటోను, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన అల్లాదుర్గం మండలంలోని రాంపూర్ గ్రామం వద్ద జరిగింది. స్థానిక ఎస్సై ప్రవీణ్ రెడ్డి కథనం ప్రకారం సీతానగర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నాగయ్య పెద్ద శంకరంపేట సంతకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా రాంపూర్ గ్రామ శివారులో ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తగా వాహనాన్ని నడిపి ఆటోను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ నాగయ్య గాయాలతో బయటపడగా అతనితో అదే ఆటోలో ప్రయాణిస్తున్న చిన్నోళ్ల వెంకయ్య (64) తలకు, కాళ్లకు గాయాలవడంతో వెంకయ్య అక్కడికక్కడే మృతి చెందాడు .మృతుని కుమారుడు చిన్నోళ్ల బేతయ్య ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అల్లాదుర్గం ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed