- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విద్యుదాఘాతంతో జవాన్ మృతి..
by Kalyani |

X
దిశ, ములుగు ప్రతినిధి: ఎయిర్ కూలర్ లో నీరు పోస్తుండగా విద్యుదాఘాతానికి గురై జవాన్ మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వాజేడు మండలం శ్రీరామ్ నగర్ గ్రామానికి చెందిన తాటి మనోజ్ అరుణచల్ ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులోని ఐటీబీపీ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల విధులకు సెలవు తీసుకొని తన సొంత గ్రామమైన శ్రీరాంనగర్ కి వచ్చాడు.
ఎండాకాలం కావడంతో ఇంట్లో కూలింగ్ ఉండేందుకు ఎయిర్ కూలర్ లో నీరు పోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురవడంతో అపస్మారక స్థితిలో ఉన్న మనోజ్ ను స్థానికులు ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మనోజ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మనోజ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమవుతున్నారు. శ్రీరాంనగర్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Next Story