ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

by Mahesh |
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలోని మక్సీ పట్టణం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా మరో 14 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. అలాగే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులలో ఇద్దరు మహిళలు, ఒక మైనర్, మరో వ్యక్తి ఉన్నారు. బాధితులు అంతా ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లా నుండి అహ్మదాబాద్‌కు వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్నారని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed