- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బిల్డింగ్పై నుంచి పడి సెంట్రింగ్ కార్మికుడు మృతి

దిశ, వనస్థలిపురం: నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పై నుంచి పడి ఓ సెంట్రింగ్ కార్మికుడు చనిపోయిన ఘటన హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. సీఐ నాగరాజు గౌడ్ వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణ పూర్ మండలం చిమిర్యాల గ్రామానికి చెందిన నర్సింహ్మ (50) సెంట్రింగ్ కార్మికుడు. భార్య గాలమ్మ ముగ్గురు పిల్లలతో కలిసి .. నందనవనం కాలనీలో నివాసం ఉంటున్నారు. శనివారం హయత్నగర్.. సాహెబ్నగర్కు సమీపంలో కుమ్మరికుంట వెంకటేశ్వర కాలనీ .. రోడ్ నంబర్ –3లో ఓ బిల్డింగ్ నిర్మాణం నాలుగో ఫ్లోర్కు సెంట్రింగ్ పనులు చేస్తున్నారు.
ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడగా, తీవ్ర గాయాలై స్పాట్లోనే చనిపోయాడు. దీంతో బంధువులు, స్థానిక ఏఐటీయూసీ ట్రేడ్ యూనియన్ నాయకులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అప్పటివరకు డెడ్ బాడీనీ అక్కడి నుంచి తరలించేది లేదని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బిల్డింగ్ యజమాని, బాధితులతో మాట్లాడి.. వారు సమ్మతించడంతో డెడ్ బాడీని పోస్ట్మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నర్సింహ్మ భార్య గాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజు గౌడ్ తెలిపారు.