- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
నాటు తుపాకులు, బుల్లెట్లు అమ్మేందుకు యత్నం.. పోలీసుల అదుపులో నిందితులు
by Shiva |
X
దిశ, సిటీ క్రైం: ఇద్దరు వ్యక్తుల నుంచి నాటు తుపాకులు, బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బిహార్ నుంచి ఇద్దరు వ్యక్తులు 7 నాటు తుపాకులు 11 బుల్లెట్లను అమ్మేందుకు నగరానికి వచ్చారు. ఈ క్రమంలో పక్క సమాచారంతో రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు రెక్కీ నిర్వహించి ఇద్దరు వ్యక్తులతో పాటు తుపాకులు, బుల్లెట్లను సీజ్ చేశారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే, అతడి నుంచి ఎవరు తుపాకులను కొనుకునేందుకు యత్నించారు, ఎక్కడ వారు అనే దానిపై రాచకొండ పోలీసులు ఆరా తీస్తున్నారు. పట్టుబడిన ఇద్దరు కూడా కిరాయి హంతకులనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను సీపీ సుధీర్బాబు సాయంత్రం వెల్లడించనున్నారు.
Advertisement
Next Story