లారీని ఢీకొన్న మరో లారీ..ఒకరు మృతి

by Aamani |
లారీని ఢీకొన్న మరో లారీ..ఒకరు మృతి
X

దిశ, మరిపెడ :మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజి సమీపంలో వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని మరో లారీ ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాం ఎన్టీఆర్ జిల్లా కంచికర్ల మండలానికి చెందిన డ్రైవర్ ఎడపల్లి రాంబాబు (39) మృతి చెందాడు.లారీ క్యాబిన్ నుజ్జు నుజ్జు కావడంతో క్రేన్ సహాయంతో పోలీసులు డెడ్ బాడీ ని బయటకు తీశారు. క్లీనర్ కి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రున్ని అక్కడి వారు ఆస్పత్రికి తరలించారు.

Next Story

Most Viewed