- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
షిర్డీ యాత్ర ముగించుకొని వస్తుండగా ప్రమాదం.. ఐదుగురికి తీవ్రగాయాలు
దిశ,బైంసా: బైంసా – నాందేడ్ జాతీయ రహదారి మార్గంలో శుక్రవారం ఉదయం 3 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. బైంసా నుంచి నాందేడ్ వైపు వెలుతున్న లారీ- నాందేడ్ వైపు నుంచి బైంసా వస్తున్న కారు పట్టణ సరిహద్దు ప్రాంతంలోని నాగదేవత మందిరం సమీపంలో ఎదురెదురుగా వచ్చి ఢీ కొట్టుకున్నాయి.. బైంసాలోని పిప్రీ కాలనీ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబీకులు షిరిడి సాయినాథుని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
ఇంటికి మరో 5 నిమిషాల్లో చేరుతామని వారందరూ భావిస్తుండగా ప్రమాదం జరిగి తీరని విషాదాన్ని నింపింది. ప్రమాద ఘటనలో ఆదిత్య (7), కళా పతి (48) లు తీవ్రంగా గాయపడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వీరిద్దరిని బైంసా లోని ఏరియా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్య సేవల కోసం నిర్మల్, నిజామాబాద్ ఆసు పత్రులకు తరలించారు. అయితే నిర్మల్కు తరలిస్తున్న ఆదిత్య మార్గమద్యంలోనే మృతి చెందాడు. ఇక ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కారు డ్రైవర్ కార్తీక్ (36), ఇతర కుటుంబ సభ్యులైన శ్రేయంక్ (12), రోహి (25), రము (36) లు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరిని బైంసా ఏరియా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం గాను. స్థానిక ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.