అమెరికా రోడ్డు ప్రమాదంలో శ్రీకాళహస్తి యువతి మృతి

by Jakkula Mamatha |
అమెరికా రోడ్డు ప్రమాదంలో శ్రీకాళహస్తి యువతి మృతి
X

దిశ, శ్రీకాళహస్తి: అమెరికాలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుపతి జిల్లాకు చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. శ్రీకాళహస్తికి చెందిన ఒక యువతి కూడా ఉంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం చిట్టత్తూరు గ్రామానికి చెందిన లత, భాస్కర్ రెడ్డిల కుమార్తె హరిత తన భర్త సాయి రెడ్డితో కలిపి టెక్సాస్ లో ఉంటుంది. వీరికి 2022 లో వివాహం అయింది. సోమవారం సాయంత్రం కారులో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో హరిత అక్కడికక్కడే దుర్మరణం చెందగా సాయిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే ప్రమాదంలో గూడూరుకు సమీపంలోని తిరుమూరుకు చెందిన గోపి, శివ కూడా దుర్మరణం చెందారు. తమ కుమార్తె రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో భాస్కర్ రెడ్డి కుటుంబంలో విషాదం అలుముకుంది. ఆయన బంధువులు, స్నేహితులు కుటుంబాన్ని పరామర్శించారు. రోడ్డు ప్రమాదం గురించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Advertisement

Next Story

Most Viewed